Monday, April 29, 2024

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశం

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 14 వార్డు జంగేడులో భూపాలపల్లి శాసనసభ సభ్యుడు గండ్ర వెంకట రమణా రెడ్డి విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఒకప్పుడు చిన్న కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి దినదినాభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు చేపట్టి పట్టణాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు వేసవికాలంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న సైడ్ డ్రైనేజీలు,అంతర్గత రోడ్ల ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. రాబోయే రోజుల్లో 14వ వార్డ్ జంగేడు లో జరిగే రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement