Sunday, May 12, 2024

Braking : మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఏపీ స‌ర్కార్ పెద్ద పీట – 163దిశ వాహ‌నాలు ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఏపీ స‌ర్కార్ పెద్ద పీట వేసింది. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఏపీ స‌ర్కార్ అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా మ‌హిళ‌ల రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఓ మంచి కార్యక్రమానికి… ఒక కోటి మంది మహిళలు దిశా ఆప్ డౌన్ లోడ్ చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వమే ఊరుకోద‌ని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ లో 900 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని… వీటితో పాటు మూడు వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూంకు అనుసంధానం అయి ఉంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement