Monday, April 29, 2024

తెలంగాణపై వివక్ష సిగ్గుచేటు: కేంద్రంపై నిప్పులు చెరిగిన కొప్పుల

పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం సేకరిస్తున్న విధంగా తెలంగాణ దాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దాన్యం సేకరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజను ఎఫ్సిఐ కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరు కంటి చందర్, గ్రంధాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్,జెడ్పీటీసీ రాం మూర్తి, బండారి శ్రీనివాస్, రాజ్కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement