Tuesday, May 7, 2024

Miracle Escape – కారు ను ఢీకొన్న టిప్పర్ – క్షేమంగా బయటపడ్డ కుటుంబం

నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్డు వద్ద.. గూపన్ పల్లి చౌరస్తా వద్ద కారును.. టిప్పర్ ఢీకొంది.. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా.. కారులో ఉన్న పెద్దలు ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.. గంగాస్తాన్ ఫేస్_1 లో నివాసముంటున్న ఓ వ్యక్తి తమ కుటుం బంతో.. సాయిబాబా ఆలయానికి వెళ్తున్న క్రమంలో గుపన్పల్లి చౌరస్తా వద్ద కారు యూటర్న్ చేస్తుండగా అకస్మాత్తుగా ముందు నుంచి టిప్పర్ ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసం అయింది.. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలం వద్ద చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement