Thursday, May 9, 2024

మంత్రి వేముల స‌మ‌క్షంలో బిఆర్ఎస్ లో చేరిన మైనార్టీ నేత‌లు

వేల్పూర్ (ప్రభ న్యూస్ ) – కేసీఆర్ జనంరంజక పాలన,రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మోర్తాడ్ మండల కేంద్రానికి మరియు ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల, నాగేంద్ర నగర్ గ్రామాలకు చెందిన మైనారిటీ నాయకులు,కార్యకర్తలు వేల్పూర్ మండలం మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వనించారు.

ఇవాళ్టి నుంచి మీరు అంతా నా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులని మీకు అన్ని విధాల తోడుగా ఉంటానని మంత్రి భరోసా కల్పించారు. మైనార్టీలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే చుసాయని, కేసిఆర్ ప్రభుత్వం మైనార్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తోందని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పి మైనార్టీ పిల్లలు కూడా విద్యతో నైపుణ్యం సాధించి, మేధస్సులో ప్రపంచంతో పోటీ పడేలా వారిని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. మైనార్టీల్లో ఆయా వృత్తిదారుల అభివృద్ది కోసం లక్ష రూపాయల మైనార్టీ బంధు కింద ఆర్థిక సహాయం కూడా కేసిఆర్ సర్కార్ అందిస్తోందని తెలిపారు. తెలంగాణ ఎప్పుడూ గంగా జమునా తెహజీబ్ అని మంత్రి వేముల స్పష్టం చేశారు. అన్ని మతాలు,కులాలు ఓకే గొడుగుకింద ఏ తారతమ్యం లేకుండా కేసిఆర్ నాయకత్వంలో అభివృద్ది చెందుతున్నాయని అన్నారు. తెలంగాణకు కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
పార్టీలో చేరిన వారి వివరాలు:
మోర్తాడ్ నుండి చేరిన మైనారిటీ నాయకులు.. నవీద్,జాఫర్,నదీమ్,ముఖిత్, ఫారూఖ్,హాబీబ్,అబ్దుల్ సోహీద్, అజ్మత్,అఙ్గార్ ,రఫిక్, సల్మాన్,కిజర్,ఫాహాద్, ఫయాజ్, సోహైల్,సమత్,షార్ఫాన్,ఆర్ఫాన్,ఆసీఫ్,అసాన్, రీమాన్,ఇస్మాయిల్,అఫ్తాబ్, అసలామ్,దానిష్, అవిష్,ఇబ్బు,సోఫియాన్,అఫ్జల్,ఇమ్రాన్,సమీన్,చారి, జుబేర్,రాజు,నేహల్, సదానంద్ తదితరులు చేరారు..
చేరికల కార్యక్రమంలో మోర్తాడ్ సర్పంచ్ ఆనంద్,జెడ్పిటిసి బద్దం రవి,డిసిసిబి డైరెక్టర్ మోత్కు భూమన్న,ఎంపిటిసి రాజ్ పాల్,మోర్తాడ్ గ్రామ అధ్యక్షులు రమేష్ ,అజీజ్,యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల, తొర్తి గ్రామాల నుండి చేరిన వారు..
జాకీర్, షకీల్, షేక్ బాబా,నహీద్,అన్వర్,జమల్, మోబిన్,సలీం,మక్బూల్,నహీద్ షేక్,అజీస్,ముస్తఫా, అంజద్,రహీం,షేక్ రహీం,బాబుమియ, అబ్దుల్లా.. చేరికల కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు పూర్ణానందం,నాగేంద్ర నగర్ సర్పంచ్ బాలాజీ ,స్థానిక మండల,గ్రామ నాయకులు,ప్రజా ప్రతినిధులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement