Friday, April 26, 2024

కరోనా నియంత్రణకు పని చేయండి: అధికారులకు మంత్రులు ఆదేశం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత  పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఉపాధి హామీ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే, పల్లె ప్రగతిని నిరంతరం నిర్వహించాలని సూచించారు. గతం లాగే ఈసారి కూడా కరోనా నియంత్రణకు అన్ని విధాలుగా పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది ఫ్రంట్ వారియర్స్ గా పని చేయాలని మంత్రుల ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement