Wednesday, May 8, 2024

వ‌ర‌ద బాధితుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన మంత్రి స‌త్య‌వ‌తి.. ఏటూరునాగారం పున‌రావాస కేంద్రం ప‌రిశీల‌న

ములుగు జిల్లా, YTC ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సోమ‌వారం పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శించారు. అక్కడి పరిస్థితులను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి వారికి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లు, భోజన వసతులపై ఆరా తీశారు. ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈసంద‌ర్బంగా వరద బాధితులకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. వరద బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి భ‌రోసా ఇచ్చారు. మంత్రి వెంట ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ త‌దిత‌రులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement