Saturday, May 18, 2024

సర్వాలంకారుడు అరుణాచలేశ్వరుడు

భారతదేశంలో మరెక్కడా లేని విధంగా అరు ణాచలంలో శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది.
పార్వతి దేవి ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చిం ది. ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు.
అప్పుడు అమ్మవారు అడిగారు ”మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది” అని.. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు.
”పార్వతీ! పునుగు పిల్లి వాసనకు ఆకర్షితులైన తమ భార్యలు పునుగు పిల్లి వెంట వెళు తున్నారని, ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్య లని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని ఋషులు నన్ను కోరారు. నేను సరే అన్నాను. వెనువెంటనే నేను పునుగు పిల్లి దగ్గరకి వెళ్లి ఇలా అన్నాను ”పులగా.. నీ నుండి వచ్చే ఆ సువాసన వల్ల రిషి పత్నులు నీ వెంట పడడం జరుగుతు న్నది. నువు వెంటనే నీ ప్రాణాలని వదిలేయ్‌” అన్నాను.
దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరింది.. నా నుండి, నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే.. వాటి నుండి వచ్చే సువాసనను నువు స్వీకరించాలి” అంది. అందుకు మహాశివుడు అంగీకరిం చాడు.అప్పటినుండి ఆయన తన వంటికి పులుగు వాసన అద్దుకోవడంతో ఆ సువాసనకి అమ్మ వారు పరవశించి ఉండేది. అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు. ”స్వామీ! ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు.. ఒంటి నిండా నగలు వేసుకోవాలి.. పాములు ఉండకూడదు.. నెత్తిన కిరీటం పెట్టుకోవాలి.. పట్టు పీతాంబరాలు ధరించాలి. అంతే కాదు.. భక్తులు కోరిన కోర్కెలు వెంటనే నెరవేరి పోవాలి.” అంది. ఈశ్వరుడు సరే అనడంతో అప్పటి నుంచి మనకి అరుణాచలంలో స్వామి వారు పట్టు పీతాంబరాలు ధరించి, ధగధగలాడే నగలతో నిండుగ దర్శనం ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement