Sunday, May 5, 2024

ఎంజీ మోటార్స్ ఈవీ పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌.. రెండు కంపెనీల ఉత్ప‌త్తుల‌కు శుభారంభం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్ ఇవ్వాల‌ MG ఆటోమోటివ్స్ EV పార్క్‌ను ప్రారంభించారు. VAYU యొక్క EV త్రీ-వీలర్స్ zero21, EV త్రీవీలర్‌ల సాఫ్ట్ లాంచ్ ప్రోగ్రామ్‌కు అధ్యక్షత వహించారు. రెండు EV తయారీ సంస్థలు అయిన‌ VAYU , ZERO21 లు హైదరాబాద్ ఆధారిత పారిశ్రామికవేత్తలతో ఏర్పాట‌య్యాయి.

ఇవ్వాల (బుధ‌వారం) జహీరాబాద్‌లోని ఎంజీ ఆటోమోటివ్స్ ఈవీ పార్క్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీలు తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను ఆవిష్కరించాయి. కార్య‌క్ర‌మంలో ఎంపీలు బీబీ పాటిల్, కె.ఆర్. సురేష్ రెడ్డి, జయదేవ్ గల్లా, ఎమ్మెల్యే మాణిక్ రావు, ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement