Friday, April 26, 2024

దుబ్బాక డాక్ట‌ర్ల అరుదైన ఆపరేషన్​.. వ్య‌క్తి గాల్ బ్లాడ‌ర్‌లోని 52 రాళ్ల తొల‌గింపు

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఏరియా ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు డాక్ట‌ర్లు. పిత్తాశయంలో ఉన్న 52 రాళ్ల‌ను తొలగించారు. రాజక్కపేట గ్రామానికి చెందిన కాపురబోయిన యాదగిరి 4 సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అనేక ఆస్ప‌త్రులు తిరిగాడు. నాలుగు రోజుల క్రితం దుబ్బాక ప్రభుత్వ ఆస్ప‌త్రికి వస్తే వైద్య బృందం అన్ని పరీక్షలు నిర్వహించి పిత్తాశయంలో రాళ్లున్నాయని నిర్ధారణ చేసింది.

దాంతో ఈరోజు (బుధ‌వారం) ఆసుపత్రి డాక్టర్ల బృందం అతనికి గాల్ బ్లాడర్ లో ఉన్న 52 రాళ్లను ఆపరేషన్ ద్వారా తొలగించింది. అంతేకాకుండా అతనికి కావ‌ల‌సిన బ్ల‌డ్‌ని కూడా దుబ్బాక ఆసుపత్రి నుంచి అందించారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు డాక్ట‌ర్లు భేష్ అనిపించుకున్నారు. చాలా రిస్క్ తో కూడిన ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ కావ‌డంతో యాదగిరి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడ‌ని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement