Sunday, May 12, 2024

Breaking: ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయం.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం

ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఇవ్వాల ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది. వ్య‌వ‌సాయ సీజ‌న్ అదునులో సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement