Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్ .. మొక్క‌లు నాటిన స‌ల్లూభాయ్‌!

ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన స‌ల్లూభాయ్‌, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి “గ్రీన్ ఇండియా చాలెంజ్ 5.0” లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement