Monday, April 29, 2024

TS : రాజన్న సన్నిధిలో మంత్రి కొండ సురేఖ

వేములవాడ, ప్రభ న్యూస్ః సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చక బృందం, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

- Advertisement -

అంతకుముందు వేములవాడ శాసనసభ్యులు రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు రాజన్నకు కోడే మొక్కు చెల్లించుకుని గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చక బృందం సురేఖ కు, కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు మంత్రి కుటుంబ సభ్యుల తో పాటు స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ లకు స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement