Sunday, April 28, 2024

ADB: రోడ్డు ప్రమాదంలో పీఆర్ ఉద్యోగి పీవీజీ రాజు మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ మండలం దుబ్బగూడా జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ పీవీ గోవిందరాజు (51) మృతి చెందారు. ఆదిలాబాద్ మండలం జందాపూర్ నుండి తన భార్య మాధవితో కలిసి కారులో ఆదిలాబాద్ లోని రాంనగర్ కు వస్తుండగా ఎదురుగా వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు.

రాజు భార్య మాధవికి స్వల్ప గాయాలయ్యాయి. పీవీజీ రాజు జిల్లా పరిషత్ నుండి ఇటీవలే డీఆర్డీఓ ఆఫీసుకు బదిలీ అయ్యారు. పోలీసు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడు పీవీజీ రాజుకు కూతురు, కుమారుడు ఉన్నారు. రాజు మృతి పట్ల సహచర ఉద్యోగులు డీఆర్డిఓ అధికారి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement