Monday, May 6, 2024

TS: ఎంఐఎం తొలి జాబితా విడుద‌ల..

హైద‌రాబాద్ నుంచి అస‌దుద్దీన్
ఔరంగాబాద్ నుంచి ఇంతియాజ్
బీహార్ కిషన్‌గంజ్ నుంచి అక్తరుల్ ఇమాన్
బీహార్, యుపి, మ‌హారాష్ట్ర‌లో
మ‌రికొన్ని స్థానాల‌లోనూ పోటీ

హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం నేడు లోక్ స‌భ‌కు ముగ్గురు అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేసింది.. హైద‌రాబాద్ స్థానం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మ‌రోసారి పోటీ చేయ‌నున్నారు.. మ‌హ‌రాష్ట్ర‌లోని ఔరంగాబాద్ నుంచి ఇంతియాజ్ జలీల్, బీహార్ లోని కిషన్‌గంజ్ నుంచి అక్తరుల్ ఇమాన్ పోటీకి దిగుతున్నారు… ఈ మేర‌కు అస‌ద్ ఆ పార్టీ తొలి జాబితాను నేడు విడుద‌ల చేశారు.

కాగా, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అభ్యర్థులపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చర్చిస్తున్నామ‌ని.. త్వరలో అక్కడ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు అస‌దుద్దీన్. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఏఐఎంఐఎం నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విష‌యాన్ని త్వ‌ర‌లోనే చెబుతామ‌ని వెల్ల‌డించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement