Thursday, May 2, 2024

Banjara Hillsలో వలసకూలీ మృతి…కొట్టిచంపిన సెక్యురిటీ గార్డులు

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బిహార్ కు చెందిన ఓ వలసకూలీని సెక్యురిటీ గార్డులు కొట్టి చంపారు. ఈ ఘటన ఐదు రోజుల క్రితం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు రోజులక్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.

రాత్రిపూట వర్కర్లు మొబైల్​లో పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఆ సమయంలో సెక్యురిటీ గార్డులు వారిని వారించడంతో వివాదం చెలరేగింది. దీంతో సెక్యూరిటీ గార్డులు చేసిన దాడిలో పంకజ్ అనే వలసకూలీ చనిపోయాడు. అతను బీహార్​కు చెందిన వ్యక్తిగా సమాచారం.
వలసకూలీలకు, సెక్యూరిటీ గార్డుకు గొడవ….
సైట్​లో వలసకూలీలను సెక్యూరిటీ గార్డులు కర్రలు, రాడ్​లలో కొట్టుకున్నారు. దీంతో పంకజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే.. ఈ విషయాన్ని సదరు కన్ స్ట్రక్షన్ కంపెనీ బైటికి పొక్కనివ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి వచ్చిన మిగతా కూలీలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలా విషయం వెలుగు చూసింది. అయితే, దీనిమీద సైట్​లో ఉన్న ఇన్​చార్జిలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. చనిపోయింది నిజమే కానీ, ఎలా చనిపోయాడు.. ఏం జరిగింది తమకు తెలియదంటూ దాటివేసే ప్రయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement