Thursday, May 2, 2024

AP CM: తెలంగాణలో ముగిసిన జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ తో చర్చలు ముగిసిన వెంటనే ఆయన లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వీరి కలయిక ఆసక్తికరంగా మారింది. తల్లితో సమావేశం తర్వాత ఆయన బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.

ముందుగా మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి ఆరోగ్యంపై మాట్లాడిన అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మను జగన్ ను కలిశారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement