Sunday, May 19, 2024

Hyd: నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ

సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ బుధవారం నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా నిర్మాతలు, ఫెడరేషన్‌ సభ్యులు ఫిలిం చాంబర్‌ భేటీ అయ్యారు. సి కల్యాణ్‌, ఎన్‌వీ ప్రసాద్‌, ప్రసన్న కుమార్‌, కిరణ్‌, సుప్రియ, కొల్లి రామకృష్ణ, సుధాకర్‌ రెడ్డి, ఠాగూర్‌ మధు, తదితరులు సమావేశమయ్యారు.

ఈ విషయంపై ఇప్పటికే ఇరువర్గాలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. దీంతో సమస్య పరిష్కారం దిశగా మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చాంబర్‌ ప్రతినిధులు, నిర్మాతలు తాజాగా ఫిలిం చాంబర్‌లో భేటీ అయ్యి సినిమా కార్మికుల సమ్మె, సినిమా షూటింగ్స్‌, వేతనాల పెంపు వంటి తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement