Sunday, May 19, 2024

TS : మధుయాష్కీ ఇంట్లో కాంగ్రెస్ మాజీ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు స‌మావేశ‌మయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ ఇంట్లో మాజీ ఎంపీలు సురేశ్‌ షెట్కార్‌, బలరాం నాయక్‌, రాజయ్య భేటీ అయ్యారు. ఉద్యమం సమయంలో పని చేసిన తమకు తొలి జాబితాలో టికెట్‌ కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

టికెట్ల కేటాయింపు విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇవాళ స‌మావేశ‌మైన మాజీ ఎంపీలు ఎల్బీనగర్‌ టికెట్‌ను మధుయాష్కీ ఆశిస్తుండగా.. హుస్నాబాద్‌ నుంచి పొన్నం ప్రభాకర్‌, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement