Monday, May 6, 2024

Nizampet: చెరువులో పడి మహిళ ఆత్మహత్య

నిజాంపేట మండల కేంద్రంలోని మల్కా చెరువులో మహిళ పడి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపేటకు చెందిన గుడ్ల లక్ష్మి వయస్సు (50) ఆమెకు ఒక కుమారుడు రంజిత్ ఉన్నాడు. అతనికి 27 సంవత్సరాలున్నా.. పెళ్లి సంబంధాలు రాకపోవడంతో మనోవేదనకు గురైంది.

సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి పడుకోగా.. ఉదయం లేచి చూసేసరికి ఆమె కనిపించకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా నిజాంపేటలో గల మల్కా చెరువులో ఒక మహిళ శవం ఉందని స్థానికులు తెలియజేయడంతో చెరువులో నుండి శవాన్ని బయటకు తీసిచూడగా గుడ్ల లక్ష్మిగా గుర్తించారు. మృతురాలి భర్త శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement