Saturday, May 18, 2024

దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్ పూర్ : ప్రసిద్ధ శైవ క్షేత్రమైన బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ప‌టాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం పరిధిలోని 34 ఎకరాల భూముల పరిరక్షణ కోసం కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శనివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల విలువైన భూములను పరిరక్షించడంలో భాగంగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో దేవాలయాల విస్తరణలో భాగంగా విలువైన భూములు ఉపయోగపడతాయని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని రుద్రారం సిద్ధిగణపతి, గుంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయాల భూముల పరిరక్షణ సైతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, ఆలయ ఈఓ శశిధర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement