Sunday, May 5, 2024

డబుల్ డెక్కర్ బస్సును ఢీకొన్న‌ ట్రక్కు… న‌లుగురు మృతి

డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సును వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు ఢీకొన‌డంతో న‌లుగురు మృతిచెంద‌గా.. మ‌రో 12మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉద‌యం జరిగింది. వలస కార్మికులతో వస్తున్న డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు బస్సు ప్రయాణికులు మరణించారు. మరో 12 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. బారాబంకీ పట్టణ సమీపంలోని మహాంగుపూర్ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. నేపాలీ వలస కార్మికులను గోవాకు డబుల్ డెక్కర్ బస్సులో తీసుకువెళుతుండగా బస్సు టైరుకు పంక్చర్ అయింది. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి టైరు మారుస్తుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు నిలిపిఉంచిన బస్సును ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement