Sunday, May 5, 2024

ఆరోగ్యం బాగోలేదు-చికిత్స‌కి అనుమ‌తినివ్వండి-శ్రీలంక‌ని కోరిన నిత్యానంద‌

శ్రీలంక‌ని శ‌ర‌ణాగ‌తి కోరారు ఆధ్యాత్మిక‌వేత్త నిత్యానంద‌. తన దీవిలో వైద్య సదుపాయాల లేమిని లేఖలో ప్రస్తావించారు. తీవ్ర అనారోగ్యంతో అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సిన స్థితిలో తాను ఉన్నట్టు వివరించారు. ఈ లేఖను నిత్యానంద తరఫున శ్రీకైలాస విదేశాంగ మంత్రి నిత్యప్రేమాత్మ ఆనంద స్వామి రాశారు. స్థానికంగా ఉన్న వైద్య సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకున్నా ఫలితం లేదని, అనారోగ్యానికి కారణమేంటన్నది వైద్యులు తెలుసుకోలేకపోతున్నారని వివరించారు. రాజకీయ ఆశ్రయాన్ని వెంటనే మంజూరు చేయాలని, దాంతో ఎయిర్ అంబులెన్స్ లో వెంటనే తరలిస్తామని చెప్పారు. అనంతరం శ్రీలంకలో సురక్షిత ప్రదేశంలో వైద్య చికిత్స తీసుకుంటారని చెప్పారు. ఇందుకు అయ్యే వ్యయాలను తాము భరిస్తామని చెప్పారు. ఎంత ఖరీదైనా సరే వైద్య ఉపకరణాలను తాము కొనుగోలు చేసుకుంటామని, చికిత్స తర్వాత వాటిని శ్రీలంక కోసం విడిచి వెళతామని చెప్పారు. రద్దు చేయలేని రాజకీయ ఆశ్రయం మంజూరు చేస్తే శ్రీలంకలో స్వామి పెట్టుబడులు కూడా పెడతారని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement