Wednesday, May 8, 2024

వీడిన సంగారెడ్డి ఇంజ‌నీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య మిస్టరీ

సంగారెడ్డి జిల్లా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్‌లో గతనెల 31న ఎంటెక్‌ సెకండియర్‌ విద్యార్థి ఆత్మహత్య మిస్టరీ వీడింది. జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మంగళవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లా నంద్యాలకు చెందిన రాహుల్‌ బింగుమల్ల(22) ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్‌ సెకండియర్‌ చదువుతూ ఆగస్టు 31న హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పట్లో ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అయితే, రాహుల్‌ ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ రాసిన సూసైడ్‌ నోట్‌ను తన ల్యాప్ టాప్‌లో డెస్క్ టాప్‌పై పొందుపరిచాడని పేర్కొన్నారు. తనకు ఉద్యోగం (ప్లేస్‌మెంట్‌) రాదన్న మనోవేదనతో పాటు కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల ఆత్మ విశ్వాసం కోల్పోయానని, తనకు రావలసిన స్కాలర్‌ షిప్‌ సకాలంలో అందడం లేదని, అందుకే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌లో రాశాడని ఎస్పీ వివరించారు. మనోధైర్యాన్ని కూడగట్టుకునేందుకు పొగతాగడంతోపాటు మద్యానికి అలవాటు పడినప్పటికీ ఒత్తిడిని అధిగమించలేకపోయినట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement