Tuesday, April 30, 2024

అదుపు తప్పి బైక్ బోల్తా… ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

కౌడిపల్లి, ఆగస్టు 5 (ప్రభ న్యూస్) : ద్విచక్ర వాహనం అదుపుతప్పడం వలన ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలోని బట్టమ్మ గుడి ఎదురుగా ప్రధాన రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండ గ్రామానికి చెందిన వడ్ల రాజు (35) హైదరాబాద్ లోని ఐక్య కంపెనీలో పనిచేస్తుంటాడు.

ఈరోజు వరుసకు బావమరిదైన శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సతీష్ ను వెంటబెట్టుకొని ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుండి బయలుదేరి బొంతపల్లి ఆలయంలో పూజలు నిర్వహించుకొని, మెదక్ వైపు వెళ్తుండగా.. మండల కేంద్రానికి సమీపాన బట్టమగుడి ఎదురుగా వాహనం అదుపుతప్పడంతో సతీష్ వడ్ల రాజు రోడ్డుపై పడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వడ్ల రాజు మృతిచందగా, సతీష్ ను మెరుగైన వైద్యం కోసం మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించారు. వడ్ల రాజుకు భార్య సంజన తల్లిదండ్రి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement