Thursday, May 2, 2024

తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు.. నీలం మధు

ఉమ్మడి మెదక్ బ్యూరో : తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కోలు సర్పంచ్ నీలం మధు అన్నారు.. పటాన్చెరు పట్టణం బండ్లగూడ గ్రామంలో నిర్వహించిన బోనాల మహోత్సవానికి నీలం మధు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మధును ఘనంగా సత్కరించారు. తెలంగాణ బోనాలు అంటే దేశవిదేశాల్లో కూడా గౌరవిస్తారని మధు స్ఫష్టం చేశారు.

సిఎం కేసీఆర్ తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలను ప్రపంచ వేదికల మీద గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్ లో కూడా ప్రజలు బీఆర్ఎస్ ను నిండు మనస్సుతో దీవిస్తే తిరిగి వస్తుందన్నారు. పలితంగా దేశం గర్వించేలా సంక్షేమం-అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో జంగయ్య, సత్యా, శ్రీశైలం, భాస్కర్, శ్రీను, బాల్ రాజ్, శ్రీను, కిషోర్, మధు, కృష్ణ, సాయి, జాతర నిర్వాహకులు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement