Thursday, May 16, 2024

బైక్ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు గాయాలు .. చికిత్స చేయించిన చంద్ర‌బాబు

తాడేప‌ల్లి – సీతానగరంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు ప్ర‌యాణిస్తున్న ద్విచక్రవాహనం ప్ర‌మాదానికి గురైంది.. దీంతో ఆ ఇద్ద‌రు కింద ప‌డి గాయాల పాల‌య్యారు.. అదే స‌మ‌యంలో పార్టీ కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు ప్రమాదానికి గురైన మహిళలను చూసి కాన్వాయ్ ను ఆపించారు. కారు దిగి గాయపడ్డ మహిళల వద్దకు వచ్చారు. తన కాన్వాయ్ లో ఉన్న డాక్టర్ తో చికిత్స చేయించారు. బాధిత మహిళలతో మాట్లాడి ధైర్యం చెప్పారు

. కాన్వాయ్ లోని ఒక కారులో బాధితులను వారి ఇంటి వద్ద దించి, వారికి కావాల్సిన మందులను ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తో బాధితుల బంధువులకు ఫోన్ చేయించారు. అనంతరం బాధితులను వాహనంలో పంపించి, ఆయన అక్కడి నుంచి పార్టీ ఆఫీస్ కు బయల్దేరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement