Tuesday, May 7, 2024

gudupalli: తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ ఆత్మహత్య

గుడుపల్లి, జులై 14(ప్రభ న్యూస్): చిత్తూరు జిల్లాలోని గుడుపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఓఎన్ కొత్తూరు వీఆర్ఏ గోవిందప్ప ఆత్మహత్య చేసుకొన్న సంఘటన సంచలనంగా మారింది. గుడుపల్లి మండలం ఓఎన్ కొత్తూరు గ్రామ పంచాయతీ పెద్దకోటమాకుల పల్లి గ్రామానికి చెందిన వి.గోవిందప్ప (72) వీఆర్ఏ గా పనిచేస్తున్నారు.

గోవిందప్ప విధుల్లో భాగంగా గురువారం రాత్రి కార్యాలయంలో రాత్రి వాచ్ మెన్ గా ఉన్నారు. అతనితో పాటు మరొక్క వీఆర్ఏ పనిచేసి ఉదయం అతను ఇంటికి వెళ్ళిపోయారు. గోవిందప్ప తహశీల్దార్ కార్యాలయంలో రెండు డోర్ లకు లోపలి వైపు గడియపెట్టి లోపలి వైపు ప్యానుకు వైరుతో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. కార్యాలయ సిబ్బంది చూసి క్రిందకు దింపారు. ఆయన మృతికి కారణం పోలీసుల దర్యాప్తులో బయటకు రానున్నది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement