Tuesday, April 30, 2024

suryapet: 16న జిల్లా కేంద్రంలో సేవాంకిత సభ : మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, ప్రభ న్యూస్: ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరని, ఈనెల 16న జిల్లా కేంద్రంలో సేవాంకిత సభ ఉంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రతీ ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించారని కొనియాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టాగోష్టిగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద నుండే పోరాటం ప్రారంభమైందని గుర్తు చేశారు. వ్యాపారంతో పాటు సమాజ సేవలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న వర్తక వ్యాపార వర్గాలు నాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం మొదలు, నిన్నటి వేరు తెలంగాణా ఉద్యమాలకు ఊపిరిలూదారని పేర్కొన్నారు.

నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది సూర్యాపేటలోనేనని, అది కూడా వర్తక వ్యాపార వాణిజ్య వర్గాల ప్రోత్సాహంతోటేనని ఆయన తెలిపారు. ఆ తరువాత జరిగిన 1969 తెలంగాణా తోలి దశ ఉద్యమం మొదలు,1972లో జరిగిన జై ఆంద్రా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైంది కూడా చైతన్యానానికి మారు పేరుగా నిలిచిన సూర్యపేట నుండేనన్నారు. ఆ తరువాత క్రమంలో 1998 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై తెలంగాణా జనసభ పేరుతో వేరు తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పోసింది ఇక్కడేనన్నారు. పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నరసింహా రెడ్డి, ఉప్పల మల్సుర్ లు సూర్యాపేట బిడ్డలు కావడం గర్వించదగ్గ విషయమన్నారు.

జిల్లా కేంద్రంలో బాలభవన్ ఏర్పడిందంటే వనమా వెంకట్రామయ్య గొప్పతనమే నని చెప్పారు. వారిని స్మరించుకునేందుకే ఈనెల 16 న సూర్యాపేట జిల్లా కేంద్రంలో సేవాంకిత సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వనమా వెంకట్రామయ్య, గుండా వెంకటప్పయ్యలను స్మరించు కోవడంతో పాటు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన కేసి గుప్తా విగ్రహం రోడ్ల విస్తరణతో పక్కకు పోయినందున అదే రోజు పునరుద్ధరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మీలా మహాదేవ్, మొరిశెట్టి శ్రీనివాస్, ఉప్పల ఆనంద్, తోట శ్యామ్, బండారు రాజా, రాచర్ల కమలాకర్, మీలా వంశీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా ఆనంద్, గుండా శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement