Friday, May 17, 2024

Election Campaign – పుస్తెలు తెగ‌డంలోనూ తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ – ఈటల రాజేందర్

కెసిఆర్ మ‌ధ్యం పాల‌సీతో పెరిగిన దుకాణాలు
రోజు రోజుకు పెరుగుతున్న మ‌ద్యం అమ్మకాలు
లిక్క‌ర్ అధికంగా సేవించ‌డంతో పెరుగుతున్న మ‌ర‌ణాలు
బోడుప్ప‌ల్ ప్ర‌చార స‌భ‌లో బిజెపి అభ్య‌ర్ధి ఈట‌ల రాజేంద‌ర్

మ‌ల్కాజిగిరి – ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని ధరణిని కేసీఆర్ తీసుకువచ్చారని, కానీ ధరణి వల్ల ఎంతో మంది నష్టపోతున్నారన్నారు మ‌ల్కాజిగిరి లోక్ స‌భ బిజెపి అభ్య‌ర్ధి ఈటల రాజేందర్ . తెలంగాణ అన్నింటా మొదటి స్థానంలో ఉందని.. అలాగే పుస్తెలు తెగడంలో కూడా మొదటి స్థానంలో అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆకృతి టౌన్ షిప్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ మీట్‌లో మాట్లాడుతూ.. మద్యం సేవించడంలో కూడా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు పండగలకు మాత్రమే తాగేవారని ఇప్పుడు తాగడం రోజువారీ పని అయిపోయిందన్నారు. దీంతో మ‌ర‌ణాలు అధికంగా సంభ‌విస్తున్నాయ‌న్నారు..

- Advertisement -


తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలో, హాస్టళ్లల్లో సన్న బియ్యం పెట్టమని జీవో ఇచ్చానని గుర్తు చేశారు.
కరోనా సమయంలో బాధితుల వద్దకు వెళ్ళి వారికి ధైర్యాన్ని కలిపించి ఎందరో ప్రాణాలు కాపాడానని అన్నారు. అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికైనా తెలుసా, దందాల కోసం రాజకీయాలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓటు వేస్తేనే పదవి వస్తుందన్నారు. సమాజం చల్లగా ఉంటేనే నాయకులు చల్లగా ఉంటారని అన్నారు. మోదీకి ఓటు ఎందుకు వేయాలో అభినందన్ తల్లిని మోడీకి ఎందుకు ఓటు వేయాలో ఇస్రో శాస్త్రవేత్తలను , టాయిలెట్లను ఇంటింటికి కట్టించి వాటిని ఉపయోగిస్తున్న మహిళలను అడగాలన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేయించి వ్యాక్సిన్ ను ఉంచితంగా ఎవరెవరు వేయించుకున్నారో వారిని అడగాలి మోడీకి ఎందుకు ఓటు వేయాలో అని అన్నారు. 16 ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్సిట్యూట్‌లు ప్రారంభించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. అలాగే 10 సంత్సరాలలో ఎక్కడైనా మోడీ తలదించుకునే పని చేశారా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement