Saturday, April 27, 2024

మానసీకోల్లాసానికి క్రీడలు..

జిన్నారం : క్రీడలు మానసీకోల్లాసానకిి ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. జిన్నారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల మైదానంలో నవీన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్‌ చిత్రపటానికి పూలలమాల వేసి నివాళులర్పించారు. మిత్రుడు స్మారకార్థం టోర్నమెంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అత్యంత ప్రేక్షకా దరణ కలిగిన క్రికెట్‌ పట్ల యువకులు మక్కువ చూపడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడుతూ క్రీడాకారులను ఉల్లాస పరిచారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, జిల్లా టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్‌, అమీన్‌పూర్‌ ఎంపీపీ దేవానంద్‌, స్థానిక సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌, సర్పంచులు అంజనేయులు, సత్యనారాయణ, వార్డు సభ్యులు శ్రీనివాస్‌యాదవ్‌, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, గాండ్ల బ్రహ్మేందర్‌, గాండ్ల శ్రీనివాస్‌, మోహన్‌గోపి, రామకృష్ణ, నర్సింగ్‌ రావు, నిర్వాహకులు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement