Wednesday, April 24, 2024

ఆలయ నిర్మాణానికి విరాళం..

యాచారం : మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామ పంచాయతి పరిధిలో నూతనంగా లక్ష్మీ నర్సింహ్మా స్వామి ఆలయ నిర్మాణానికి మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్‌ యాదవ్‌ ఒక లక్ష 30వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కొరికలు తీర్చే దేవుడిగా పేరు ప్రాఖ్యాతలు పొందిన లక్ష్మీ నర్మ్సింహా స్వామి ఆలయ నిర్మాణానికి తనవంతుగా సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందని ఆలయ అభివృద్ది కోసం రాబోయే రోజుల్లో మరింతగా కృషి చేస్తానని ఆదివారం రోజు ఆలయ కమిటీ సభ్యులకు ఒక లక్ష 30వేల రూపాయలను అందించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బండిమిది కృష్ణ, ఉపసర్పంచ్‌ మేకల యాదగిరిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement