Wednesday, May 15, 2024

చదువుతో పాటు క్రీడలు కూడా..


చిన్నకోడూర్‌ : యువత క్రీడల పట్ల్ల ఆసక్తి పెంపోందించుకోవాలని చదువుతో పాటు క్రీడలు జీవితానికి బంగారు బాటలు వేస్తాయని ఎంపిపి మాణిక్య రెడ్డ్డి, గోనెపల్లి ఎంపిటిసి బండి పద్మ మల్లేశం గౌడ్‌ అన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ తన్నిరు హరీష్‌ అన్న ఆశీస్సులతో గోనెపల్లి గ్రామంలో వాలీబాల్‌ పోటీలను ఎంపిటిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల యువత ఈ అవకాశన్ని అందిపుచ్చుకుని వారిలో ఉన్న క్రీడా నైపుణ్యలను బయటకు తీయలన్నారు. శారీరకంగా మానసికంగా ఆటలు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయని యువత ప్రతి ఒక్కరు వాలీబాల్‌ పోటీల్లొ పాల్గోనాలని కోరారు అనం తరం గ్రామంలోని యువకులకు వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేసారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఉపసర్పంచ్‌ వార్డు మెంబర్లు యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement