Sunday, April 28, 2024

కరోనా టీకా వేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు..

నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ ఆదేశాలమేరకు, నారాయణఖేడ్ డిపో మేనేజర్ శ్రీరామచంద్రమూర్తి ప్రోత్సాహంతో ఖేడ్ డిపో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది కరోన టీకాలు తీసుకునేందుకు తుర్కపల్లి ఆరోగ్యకేంద్రం వద్ద బారులు తీరారు. ఆసుపత్రి వైద్యులు రాజేష్ తో పాటు ఆసుపత్రి ఉద్యోగులు, సిబ్బంది పూర్తి సహకారంతో ఖేడ్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది టీకాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 80మంది టీకాలు తీసుకున్నారు. ఉద్యోగులకు టీకాలు ఇప్పించడంలో కృషిచేస్తున్న మార్కెటింగ్ సెల్ ఇంచార్జ్ పాండును అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పరమేష్, ఎస్సి, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు రవీందర్ నాయక్, వైద్యులు రాజేష్ లు అభినందించారు. ఈకార్యక్రమంలో ఆసుపత్రి ఉద్యోగులు ఇమ్రాన్, పి.విజయ్ కుమార్, ఆర్టీసీ ఉద్యోగ నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement