Monday, May 6, 2024

మురుగునీటి కాలువను శుభ్రం చేసిన సిబ్బంది..

గుమ్మడిదల : ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైన రోడ్డుపై పారుతున్న మురుగునీరు అనే శీర్షికకు ఆ గ్రామ సర్పంచ్‌ అభిశెట్టి రాజశేఖర్‌ వెంటనే స్పందించారు. సంబంధిత పంచాయితీ సిబ్బందితో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి మురుగునీటి కాలువలను శుభ్రం చేయించారు. దీంతో అక్కడి కాలనీవాసులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కారకులైన ఆంధ్రప్రభ విలేకరినీ కాలనీవాసులు ఫోన్‌ ద్వారా సంప్రదించి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement