Sunday, May 19, 2024

మల్లన్న సాగర్ నుండి దుబ్బాకకు నీరు విడుదల చేసిన ఎంపీ

తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 23వ తేదీని ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అయితే మల్లన్న సాగర్ నుండి దుబ్బాక నియోజకవర్గానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు నీరు విడుదల చేశారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి లు నీటి విడుదల కార్యక్రమంలో ఉన్నారు. ఈ నీటి విడుదలతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ హుస్సేన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement