Tuesday, May 7, 2024

పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: షెకావత్

పోలవరం పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని కేంద్ర జలశక్తి వనరుల మంత్రి షెకావత్‌ అన్నారు. పోలవరం పర్యటనలో భాగంగా సీఎం జగన్‌, కేంద్ర జలశక్తి వనరుల మంత్రి షెకావత్‌ తాడువాయి పునరావాస కాలనీలో నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగుపర్చాలన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం.. మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. అన్ని పనులు జరుగుతాయని, పోలవరం పూర్తికి కేంద్ర సహకారం ఉంటుందన్నారు. ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తా షెకావత్‌ వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement