Sunday, April 28, 2024

డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

దుబ్బాక : రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామంలో 50 మంది అర్హులైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గృహా ప్రవేశాలు చేయించారు. అనంతరం పోతరెడ్డిపేట క్లస్టర్ రైతు వేదిక ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement