Friday, May 10, 2024

తిరుపతి జిల్లా కలెక్టర్ తో ఎంపీ గురుమూర్తి సమావేశం

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో తాను తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన విషయాలపై చర్చించేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డితో ఎంపీ గురుమూర్తి  సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు ఎంపీ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఐటీ కాన్సెప్ట్ సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్స్టిట్యూట్, అంభేద్కర్ నవోదయ విద్యాలయాలకి భూ కేటాయింపులు చేయాలని కలెక్టర్ కోరినట్టు చెప్పారు. అలాగే తిరుపతి విమానాశ్రయానికి కేటాయించిన సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. అలాగే, అభివృద్ధి కార్యక్రమాలకి చెందిన సమస్యలు, ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ని కోరినట్టు ఎంపీ చెప్పారు. అలాగే తన కార్యాలయంలో స్వీకరించిన పలు సమస్యలకి సంబందించిన వినతి పాత్రలను సత్వర పరిష్కారానికి కలెక్టర్ కి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement