Sunday, May 19, 2024

TS | బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు.. కాంగ్రెస్​, బీజేపీ నుంచి రాక!

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభ న్యూస్​) : బీఆర్​ఎస్​ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని మంత్రి హరీశ్​రావు క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా నుంచి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇవ్వాల సదాశివపేటకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి యువ నాయకులు  చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి హరీశ్​రావు  కండువా కప్పి  పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

చేరిన వారిలో ముఖ్యులు.. పాలనేత్ర గౌడ్, సదాశివపేట యూత్ కాంగ్రెస్ ప్రసిడెంట్ సదాశివపేట పట్టణం , ధనుంజయ్  గౌడ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సదాశివపేట టౌన్ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ , బిజెపికి చెందిన దాదాపు 100 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు…

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలకు దూరంగా ఉంటూ.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా చింతా ప్రభాకర్ నిరంతరం  సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తూ  ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారన్నారు.

- Advertisement -

సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయానికి యువత కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ విధానం మూడు గంటల కరెంటు.. బీఆర్ఎస్ విధానం మూడు పంటలకు కరెంటు అనిచెప్పారు. అధికారంలోకి రాకముందే రైతు వ్యతిరేక విధానాలు ప్రవేశపెడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, బిజెపికి బుద్ధి చెప్పాలని, రైతు బాంధవుడైన కెసిఆర్​ని  మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చుకోవాలన్నారు.

కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు చీల మల్లన్న, చింతా గోపాల్ ,పిల్లోడి విశ్వనాథం , పులిమాడి రాజు , మోబిన్ , శ్రీశైలం , పెద్ద గౌడ్ , విజెందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు , రాం రెడ్డి నర్సింలు ,మనోహర్ గౌడ్ ,చింత సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement