Friday, May 17, 2024

క‌మ‌లం గూటిలో జ‌య‌సుధ … కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన త‌రుణ్ చుగ్

న్యూఢిల్లీ – తెలంగాణలో బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరిపోయారు.. ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆమె నేటి సాయంత్రం బిజెపి కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో క‌షాయ తీర్థం తీసుకున్నారు..

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ త‌రుణ్ చుగ్ ఆమెకు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి , జాతీయ ఉపాధ్య‌క్షురాలు డి కె అరుణ‌ పాల్గొన్నారు.. కాగా, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి జయసుధ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు కూడా ఆమె సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్ ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందా? లేదా పార్టీలో ఇతర బాధ్యతలను అప్పగిస్తుందా? అనే విషయం వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement