Monday, May 13, 2024

కరాటే శిక్షణ లో మాస్టర్ ల ప్రతిభ

జగదేవపూర్ : మండల కేంద్రంలో గల అతిథి గృహంలో కరాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ షోటోకన్ సంస్థ ,దక్కన్ ఇండియా వారి ఆధ్వర్యంలో కరటే శిక్షణ శిబిరం సిక్రింద్రాబాద్ లో గల మౌలాలిలో నిర్వయించడం జరిగింది. ఎఐకేఎఫ్ 7 టైమ్స్ ఛాంపియన్ మరియు ఇంటర్నేషనల్ జెకెఏ ఇండియా జపాన్ కరాటే అసోసియేషన్ మాస్టర్ చంద్రశేఖర్ శెట్టి మరియు తెలంగాణ చీఫ్ మాస్టర్ రాపోలు సుదర్షన్ ల సహకారం తో మాల్యాల రాజు సమక్షంలో ఈ కరాటే శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి దాదాపు 200మంది కరాటే మాస్టర్స్ ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు . సిద్దిపేట జిల్లా నుంచి సుమారు 30 మంది మాస్టర్ లు ఈ శిక్షణలో పాల్గొనగా ప్రశంసపత్రాలు అందుకున్నారు.ఈ శిబిరంలో సిద్దిపేట జిల్లా నుంచి భాగ్యరాజ్, బాలరాజు , పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement