Wednesday, May 1, 2024

కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శం

కౌడిపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండవ విడత వైద్య శిబిరాన్ని మండల పరిధిలోని సలాబత్పూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ రాజు నాయక్, సర్పంచ్ రజిత సాయి రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సారా రామ గౌడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని, ప్రతీ ఒక్కరు కంటి వైద్య శిబిరానికి వచ్చి నేత్ర పరీక్షలు నిర్వహించుకొని అద్దాలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ ప్రజా ప్రతినిధులు, వార్డు మెంబర్లు, ఆశ వర్కర్లు కంటి వెలుగు వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, జెడ్పిటిసి కవిత, అమర్ సింగ్, డాక్టర్ విజేత, సూపర్వైజర్ రమేష్, ఏఎన్ఎం లు నీల మజీద రిబిక, పీఎంఓ రవళి, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ సులోచన, ప్రశాంత్, ఉపసర్పంచ్ గోపాల్, ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement