Sunday, April 28, 2024

యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదోనిలో చేపట్టిన యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదోని పట్టణంలోని బీమా సర్కిల్ ప్రధాన రహదారులు మధ్యాహ్నం 12:30కు కొంతమంది ఆదోనికి చెందిన యువకులు నారా లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న టీడీపీకి చెందిన కొంతమంది యువకులు నినాదాలు చేసిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చిన్నహరివనంకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయంపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement