Monday, April 29, 2024

TS : చెలిమి ఫౌండేషన్ చేయూత

గ‌జ్వేల్‌, మార్చి 21(ప్ర‌భ‌న్యూస్‌): గజ్వేల్ చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 61 వ కార్యక్రమాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజ్ఞాపూర్ 3వ‌ వార్డులో గురువారం నిర్వహించారు. ఈ వార్డుకు చెందిన మర్కంటి బాలరాజు గుండె పోటుతో ఇటీవల మృతిచెందారు.

వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఈ విష‌యం తెలుసుకొని చెలిమి ఫౌండేషన్ తరపున 3500 నిత్యావసర సరుకులు,11500 నగదును అధ్యక్షులు గుర్రం తులసీదాస్ అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొండాపురం యాదగిరి, కోశాధికారి దొంతుల ఆనంద్ , సభ్యులు గుంటుకు శ్రీనివాస్,టెంట్ నర్సింలు, నాగపురి రమేష్, పెదూరి శ్రీనివాస్,యాట ఆంజనేయులు, మంగళపల్లి సత్యనారాయణ,తిగుల్ల కేశవ్, జాలమల్లేశం, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రొట్టల శ్రీనివాస్ , క్యాషియర్ శ్రీరామ్ కృష్ణ,పెర్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement