Sunday, April 28, 2024

National : విచారణకు సిద్ధం.. కేజ్రీవాల్‌ మరో పిటిషన్‌…

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ఈడీ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఇవాళ‌ ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో
తాజాగా ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు కేజ్రీవాల్‌.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హాజరు కావాలంటూ ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే తొమ్మిదిసార్లు సమన్లు జారీ అయ్యాయి. విచారణకు రాకపోవడంతో ఈడీ సైతం ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేయగా.. ఆయన బెయిల్‌ దక్కించుకున్నారు.

- Advertisement -

అయితే తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్‌ చేస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో హడావిడిగా మరో పిటిషన్‌ వేశారు. ఈడీ విచారణకు తాను సిద్ధమని, ఈడీ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ ఆయన పిటిషన్‌ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement