Monday, April 29, 2024

మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు.. చింత ప్రభాకర్

సంగారెడ్డి, జులై 22 (ప్రభ న్యూస్) : టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధుల నుంచి సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు నిధులు కేటాయించారు. సంగారెడ్డికి రూ.20కోట్లు, సదాశివపేటకు రూ.20 కోట్లు రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ తెలియజేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి గతంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు రూ.50 కోట్లు మంజూరు చేశారు.

ఈ రూ.50కోట్ల నిధులతో సంగారెడ్డి మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఆ నిధులతో పరిష్కారం అవుతాయన్నారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ… సంగారెడ్డి మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement