Tuesday, May 7, 2024

నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. మంత్రి పెద్దిరెడ్డి

అనంతపురం, జులై 22, ప్రభ న్యూస్, ప్రతినిధి : నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందులో భాగంగానే తాడిపత్రి నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారులను సమన్వయం చేసుకొని ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement