Monday, April 29, 2024

సంగారెడ్డిలో ఫ్రీడ‌మ్ ర‌న్‌…

మన భారతదేశ75 వ  స్వాతంత్ర  పక్షోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజ‌రై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య మహనీయుల వలన మనకు స్వాతంత్ర్యం వచ్చింద‌ని, 75 సంవత్సరాలలో అడుగుపెట్టిన ఈ వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరు స్వాగతించి తమ ఇళ్ల పైన జాతీయ జెండాలను కట్టుకోవాల‌ని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement