Thursday, May 9, 2024

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శనివారం ఉదయం పటాన్ చెరు పట్టణ పరిధిలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏపీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 5కే రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు కనీసం గంట సమయం వ్యాయామానికి సమయం కేటాయించాలని అన్నారు. దీని ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుద్యత లభిస్తుందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎండి సంజీవరెడ్డి, భారీ సంఖ్యలో ఏపీఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement